ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలు, అవినీతి పై CBI దర్యాప్తు చేయాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు డిమాండ్ చేశారు.
వివాదాస్పద అధికారిగా పేరుగాంచిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహార శైలి ప్రశ్నార్థకంగా వుందని ఆయన అన్నారు.
ఒక ప్రభుత్వ ప్రజా సేవకుడిగా వుండి సమాజంలో విభజన వాదాన్ని రెచ్చగొట్టి, హిందువుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాడని ఆయన అన్నారు.
అరాచకాలు సృష్టించి మతసామరస్యాన్ని విచ్చిన్నం చేసేవిధంగా నిందనీయమైన విషయమని ఆయన అన్నారు.
హిందు మతం పై, హిందూ ధర్మం పై అయన తన మిత్రుల తో కలిసి విషం చిమ్మే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని శేఖర్ రావు అన్నారు.
అయన తన మానస పుత్రిక అయిన స్వేరో సంస్థ ద్వారా తన మిత్రులకు కేటాయించిన కాంట్రాక్టుల పై , బినామి ఆస్తులపై వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వెంటనే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని సాంఘిక సంక్షేమ బాద్యతల నుంచి తప్పించి ,ప్రభుత్వ బాధ్యత నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నానని శేఖర్ రావు అన్నారు.