చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
కరోనా నుంచి కొలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఎంజీఎం ఆసుపత్రికి కొద్ది సేపటి కిందట ఆయన సతీమణి చేరుకున్నారు.
అదే విధంగా బాలసుబ్రహ్మణ్యంకు అత్యంత సన్నిహితుడైన కమల్ హసన్ కూడా ఆసుపత్రికి వద్దు వచ్చారు. వేలాది మంది అభిమానులు కూడా అక్కడకు చేరుకుంటున్నారు.
మరి కాసేపట్లో ఎంజిఎం వైద్యులు బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. ఆగస్టు 5న కరోనాతో ఆయన హాస్పిటల్ లో చేరారు.
ఆగస్టు 13న పరిస్థితి విషమంగా వుండడంతో ICU కు తరలించి వెంటిలేషన్ పై ట్రీట్ మెంట్ ఇస్తున్నారు వైద్యులు. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తున్నారు.
అయితే చరణ్ చెప్పే మాటలకూ విడుదల చేసే వీడియొ లకు తమకు సంబంధం లేదని, కాసేపట్లో అధికారిక బులిటిన్ విడుదల చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
SP బాలు ఆరోగ్యం తీవ్ర విషమంగా మరిందని తెలిసింది. ఆయన కోలుకునే అవకాశాల కోసం డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు.