సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పాలకీడు మండలం బొత్తపాలెం గ్రామంలో DMFT నిధుల ద్వారా విడుదలైన 13 లక్షల రూపాయలతో CC రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమంలో నియోజకవర్గ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కనుకనే రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
మూసీ నది వలన నియోజకవర్గంలో ఎక్కువగా లబ్ది పొందేదీ పాలకీడు మండలం లోని గ్రామాలని, అందుకే 20 కోట్ల రూపాయలతో 5 చెక్ డ్యామ్ ల ఏర్పాటు జరిగిందని, వేములూరి చెక్ డ్యామ్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు.
నియోజకవర్గంలో చింతలపాలెం, పాలకీడు మండలాలలో కస్తూర్భ గాంధీ పాఠశాలలు మంజూరు అయ్యాయని, త్వరలో శంఖుస్థాపన కార్యక్రమం ఉంటున్నాడని అన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని, ఏ పార్టీ నుండి వచ్చినా అందరూ సమానమే అని,ఇసుక మాఫియా అరికట్టేందుకు త్వరలో పరిష్కారం లభిస్తున్నదని అన్నారు.
అనతరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి సుమారు 100 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నేరేడుచెర్ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇంజమూరి యశోదా రాములు, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి , సర్పంచ్ బోగాల వీరారెడ్డి, ఎంపిటిసి ఉపేంద్ర, ఉప సర్పంచ్ వెంకయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.