విధినిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ కు ప్రభుత్వంతో బాటు సాటి పోలీసు అధికారులు సాయం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న2018 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ఆర్ మనోజ్ కుమార్ గుండెపోటుతో మరణించాడు.
బాధిత కుటుంబానికి చేయూతగా ప్రభుత్వం కార్పస్ ఫండ్ నుంచి రూ.50,000 జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ఒక రోజు వేతనం రూ.6,56,000 కలిపి మొత్తంగా ఏడు లక్షల 6 వేల రూపాయలను ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీ వై వి ఎస్ సుధీందర అందచేశారు.
అంతే కాకుండా వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శాఖాపరంగా అందాల్సిన బెనిఫిట్ లను త్వరితగతిన బాధితులకు అందజేయాల్సిందిగా సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సంఘం ప్రెసిడెంట్ ఎం విజయ శంకర్ రెడ్డి, ఏవో భక్త ప్రహ్లాద, బి సూపరిండెంట్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.