40.2 C
Hyderabad
April 26, 2024 11: 58 AM
Slider ముఖ్యంశాలు

గుడ్ వర్క్: టీఎన్జీవో సంఘాల ప్రతినిధుల రక్తదానం

minister srinivasagowd

తలసేమియా రోగుల కోసం హైదరాబాద్ నారాయణ గూడ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో టీజీవో, టీఎన్జీవో సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ శ్రీ దేవి ప్రసాద్, TNGO అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, TGO ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి రవీందర్ కుమార్ గౌడ్, కార్యదర్శి సహదేవ్, వెంకటయ్య, రవీందర్ రావు, అరుణ్ కుమార్, సబిత, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు M B కృష్ణ యాదవ్, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు గoడూరి వెంకట్ TGO, TNGO కేంద్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.

తలసేమియా వ్యాధి రోగుల కోసం ఉద్యోగులు రక్తదానం చేయటాన్ని మంత్రి  అభినందించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. ఉద్యోగులు నిరంతరం సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, ఇది అభినందనీయమని మంత్రి వెల్లడించారు. TGO, TNGO ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

Related posts

పవర్ ఫుల్ రేణు దేశాయ్ ‘ఆద్య’ ఆరంభం

Satyam NEWS

విద్యుత్ రంగంపై పచ్చి అసత్యాలు చెబుతున్న కేసీఆర్

Satyam NEWS

జాతీయ నాయకులకు అందరూ కనీస గౌరవం ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment