హైదరాబాద్ లోని అంబర్ పేట నియోజకవర్గంలోని బాగ్ అంబర్పెట్ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సి సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. 50లక్షల రూపాయల వ్యయంతో గజానంద్ గడ్డ నుండి గాంధీబొమ్మ మెయిన్ రోడ్ వరకు నూతనంగా ఈ సి సి రోడ్డును వేయనున్నారు. అదేవిధంగా గజానంద్ గడ్డ, కుమ్మరి వాడి బస్తీలో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ కలిసి పాదయాత్ర చేస్తూ అక్కడున్న బస్తి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా ఇంచార్జ్ బి.వెంకట్ రెడ్డి, జీహెచ్ఎంసి అధికారులు, బిజెపి, తెరాస నాయకులు,బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట