నేటి యువత సమయాన్ని వృధా చేయకుండా క్రొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని గ్రీన్ వుడ్ స్కూల్ చైర్మన్ తుమ్మ సరితా మరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గ్రీన్ వుడ్ పాఠశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ సైన్స్ లో నోబెల్ పురస్కారం అందుకున్న గొప్ప వ్యక్తి సర్ సి.వి.రామన్ అని,నేడు ఎంతోమంది మేధావులు యువ శాస్త్రవేత్తలు వారి బాటలోనే నడుస్తున్నారని,నేటి యువత సమయాన్ని వృధా చేయకుండా క్రొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన పలు సైన్స్ ప్రాజెక్ట్ లను తిలకించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజారెడ్డి, కరస్పాండెంట్ కృష్ణారావు, సైన్స్ ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు టి.దీప్తి,బి.రామ్మోహన్,రవిశంకర్, కళావతి,శ్రీలత,శ్వేత తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్