ప్రతి వినాయక చవితి సమయం కొత్త కొత్త గణనాథుడి మండపాలు… వాటికోసం వ్యాపారుల,ఉద్యోగుల, సంఘాలతో ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరితో చందాలు వసూలు చేసేవారు. ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడే వారు. కరోనా మూలంగా ఈ సారి ఊపిరి పీల్చుకుంటున్నారు.
వాస్తవంగా రాష్ట్ర మొత్తంలో వినాయక చవితి కోసం కోట్ల రూపాయలు చందాలు వసూలు అవుతాయి. చందాదారులు చాలా వరకు ఈ సారి ఖర్చులు మిగిలించుకుంటున్నారు. ప్రతి ఏటా చందాలు వసూలు చేసే మండపాల కార్యకర్తలు ఈసారి తమ వంతుగా సొంత ఇంట్లో సొంత ఖర్చులతో ఇంట్లో వినాయకునికి 11, 9 రోజులు పూజలు చేయాలి.
చాలా వరకు ప్రజలు భక్తితో చందాలు ఇస్తారు. కానీ ఈసారి మండపాల కార్యకర్తల గణేష్ ని పరీక్ష లో భక్తిని ఎలా చూపించుకుంటురో చూడాలి..సామాన్య ప్రజలు గణనాథుడికి 9,11 రోజులు ఇండ్లలో పూజలు చేయడం సర్వసాధారణం…
ప్రతి మండపాల కార్యకర్తలు తమ భక్తిని చూపించుకోవడానికి సమయంగా భావించాలి. ప్రతి రోజు పూజ సమయంలో ఫోటోలు దిగి ఉదయం, సాయంత్రం తమ స్మార్ట్ ఫోన్ స్టేటస్ లలో పెట్టుకోవాలి. గణనాథుని పై భక్తిని చూపించాలి. ఈసారి కరోనా కాలంలో చందాదారులు ఖర్చులు మిగిలించుకుంటున్నారు. ఆ ఖర్చులతో నిరుపేదలకు సహాయ పడాలి.
కరోనా బాధితులకు సహకరించాలి. భక్తిని ఈ విధంగా ఈ సారి చూపించుకోవాలి. ఏది ఏమైనా.ఇసమయంలో పోలీస్ శాఖ వారు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు చెప్పాలి. ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి నిర్ణయం తీసుకునందుకు…!
ఔట రాజశేఖర్, కొల్లాపూర్