ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నెలాఖరుకు మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెలాఖరుకు జరిగే పార్లమెంట్ సెషన్స్ లో ప్రకటన చేస్తామని తెలిపారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లులను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని ప్రధాని కోరారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.