హైదరాబాద్ లోని యల్లారెడ్డి గూడాలోని శ్రీహనుమాన్ దేవాలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
నేడు యల్లారెడ్డి గూడా శ్రీహనుమాన్ దేవాలయం ట్రస్టు బోర్డు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. నూతన సభ్యులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో బాటు శ్రీనగర్ డివిజన్ అధ్యక్షుడు పప్పు, తన్ను, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.