38.2 C
Hyderabad
April 28, 2024 19: 50 PM
Slider ఆంధ్రప్రదేశ్

అయ్యో పాపం: బందరు వీధుల్లో జోలెపట్టిన చంద్రబాబు

cbn donations

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ‘అమరావతి పరిరక్షణ సమితి’ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. రాజధాని ఉద్యమం కోసం మచిలీపట్నంలో టిడిపి అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా జేఏసీ నేతలు ప్రజాచైతన్య యాత్ర చేపట్టారు.

కోనేరు సెంటర్‌ వద్ద కాలినడకన తిరుగుతూ జోలెపట్టి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారంతా నినాదాలు చేశారు. మరోవైపు రాజధాని కోసం గుంటూరులో విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, మహిళలు రోడ్లపైకి తరలివచ్చి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Related posts

చంద్రబాబు మీటింగ్ వద్ద అపశ్రుతి: 5 గురు మృతి

Satyam NEWS

వెరైటీ: అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్

Satyam NEWS

ఇది రాజకీయ పెగాసెస్

Satyam NEWS

Leave a Comment