నెల్లూరుజిల్లా కందుకూరులో జరుగుతున్న ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన తోపులాటలో మురుగు కాలువలో పడి అయిదు మంది మృతి చెందారు. కందుకూరులో ఒకరు ఊపిరి ఆడక మృతి చెందారు. మరొకరు సైడు కాలువలో పడి మృతి చెందారు. అపస్మారక స్ధితిలో ఉన్న మరో ముగ్గురు మృతి చెందారు. గయపడిన వారు పక్కన ఉన్న ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతులు గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజా గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post