పుంగనూరులో పదుల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్భందాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. పోలీసులు తమ నిర్భందంలో ఉన్నపార్టీ క్యాడర్ ను కోర్టులో హాజరు పరచకపోవడం, హింసించడంపై చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. పార్టీ కార్యకర్తలు, నేతల అరెస్టులపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. విచారణ పేరుతో అరెస్టు చేసి కస్టడీలో కార్యకర్తలను హింసకు గురిచేస్తే….అలాంటి అధికారులు తప్పక మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారినుంచి బలవంతంగా తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు తీసుకుంటున్నట్లుకూడా తమకు తెలిసిందని అన్నారు. పుంగనూరు లో రాజకీయ నేతలను సంతృప్తి పరచడానికి తప్పులు చేసే ప్రతి అధికారి తరువాత కాలంలో సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. అరెస్టయిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని…పార్టీ అండగా ఉంటుందని…న్యాయం పోరాటం చేస్తామని తెలిపారు.
previous post
next post