ఏపి హైకోర్టులో చంద్రబాబునాయుడు వేసిన క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన అనంతరం చంద్రబాబునాయుడు ని రెండు రోజులు సిఐడి కస్టడీ కి ఇస్తూ ఏసిబి కోర్టు తీర్పు చెప్పింది. చంద్రబాబును జైల్లోనే విచారిస్తామని సిఐడి పోలీసులు కోర్టుకు చెప్పారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:00 లోపు విచారణ పూర్తి చేయాలని జడ్జి ఆదేశాలిచ్చారు. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులను అనుమతిస్తామని జడ్జి చెప్పారు. రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును విచారించాలని కోర్టు ఆదేశం ఇచ్చింది. విచారణ జరుపుతున్న వీడియో, ఫోటోలు విడుదల చేయరాదని కూడా కోర్టు ఆదేశించింది. ఆదివారం కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశం ఇచ్చారు.
previous post