29.7 C
Hyderabad
May 6, 2024 04: 56 AM
Slider మహబూబ్ నగర్

కొత్తకోట దయాకర్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు

#kottakota

దేవరకద్ర నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత పార్థివ దేహానికి పూలమాల వేసి  నివాళులు అర్పించారు. దుఃఖంలో ఉన్న దయాకర్ రెడ్డి భార్య సీతా దయాకర్ రెడ్డి, కుమారుడు వారి  కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

దయాకర్ రెడ్డి అంతిమ యాత్ర లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దయాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని (పాడెను) మోశారు. అంత్యక్రియల కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింహులు, తెలంగాణ పార్టీ కో ఆర్డినేటర్ కంభంపాటి రామ్మోహన్ రావు, తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు కాసాని వీరేశ్, టీటీడీపి మీడియా కో ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి, కార్యనిర్వాహాక కార్యదర్శిలు ప్రకాష్ ముదిరాజ్, రవీంద్రా చారి, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు బి.షకీలారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం, రాష్ట్ర నాయకురాళ్లు సూర్యదేవర లత, మహబూబ్ నగర్ పార్లమెంటు  అబ్జర్వర్ ఎం.శ్రీనివాస్, దేవరకద్ర కో ఆర్డినేటర్ శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు.

Related posts

సరిగ్గా మైనార్టీ వెల్ఫేర్ డే రోజు నే…విజయనగరం ఏఆర్ ఏఎస్పీ గా సాల్మన్ చార్జ్.

Bhavani

పెళ్లి పేరుతో మోసం చేసి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి ఉరివేయాలి

Bhavani

కోడెల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

Satyam NEWS

Leave a Comment