ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. జగన్ తన మూడేళ్ల పాలనలో ఎంతమంది నేతల వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూశారో, ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని వెల్లడించారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా ఇతర తెదేపా ముఖ్యనేతల ఫోన్లు ఎప్పటి నుంచి ట్యాప్ చేస్తున్నారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.