విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులే కాదు మూగజీవాలు కూడా మృతిచెందాయని ఆయన అన్నారు.
కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని ఆయన కోరారు. చెట్లన్నీ రంగు మారడం విషవాయు తీవ్రతకు నిదర్శనమని ఆయన అన్నారు. యుద్దప్రాతిపదికన ప్రజలందరినీ ఖాళీ చేయించాలని పునరావాసం కల్పించాలని ఆయన కోరారు.