టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రేపు (బుధవారం) కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఆయన జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 2 రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రేపు మధ్యాహ్నానికి జిల్లాలోని పత్తికొండ చేరనున్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం రాత్రికి ఆదోనికి చేరుకునే ఆయన పట్టణంలోనే బస చేస్తారు.
గురువారం ఉదయం ఆదోనిలో రోడ్ షో నిర్వహించనున్న చంద్రబాబు… ఆ తర్వాత జిల్లాలోని ఎమ్మిగనూరులో రోడ్డు షో నిర్వహించనున్న చంద్రబాబు… సాయంత్రం పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడతారు. గురువారం రాత్రికి కర్నూలులో బస చేయనున్న చంద్రబాబు… శుక్రవారం నగరంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.