40.2 C
Hyderabad
April 28, 2024 17: 53 PM
Slider కర్నూలు

రేపు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రేపు (బుధవారం) కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఆయన జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 2 రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రేపు మధ్యాహ్నానికి జిల్లాలోని పత్తికొండ చేరనున్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం రాత్రికి ఆదోనికి చేరుకునే ఆయన పట్టణంలోనే బస చేస్తారు.

గురువారం ఉదయం ఆదోనిలో రోడ్ షో నిర్వహించనున్న చంద్రబాబు… ఆ తర్వాత జిల్లాలోని ఎమ్మిగనూరులో రోడ్డు షో నిర్వహించనున్న చంద్రబాబు… సాయంత్రం పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడతారు. గురువారం రాత్రికి కర్నూలులో బస చేయనున్న చంద్రబాబు… శుక్రవారం నగరంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.

Related posts

సింహా వాహనం పై దర్శన మిచ్చిన కోదండ రాముడు

Satyam NEWS

High alert: టెర్రర్ లింక్ కారణంగా పిఎఫ్ఐ పై నిషేధం  

Satyam NEWS

అన్ని ప్రాంతాలవారి కోరికా రాజ‌ధాని అమరావతే

Satyam NEWS

Leave a Comment