విద్యలనగరం ఎంతోమంది ప్రపంచానికి అందించిన నగరం… నేడు అపఖ్యాతిని మూటకట్టుకుంది. దాదాపు 150 మంది నిరుద్యోగులను నట్టేట ముంచిన ఘనుడు విజయనగరంలో ఉండటం కారణంగా విద్యలనగరం కాస్త ఆ అపఖ్యాతినికి మూటకట్టుకుంది. ఒడిషా కు చెందిన దాదాపు 150 మంది… ఓ ఎంఎన్సి కంపెనిలో ఉద్యోగాలకు ఆశపడి.. వేలు కాదు లక్షలలో జమ చేసి…. నెలలు గడుస్తునన్న ఉద్యోగ లభించకపోగా.. ఇచ్చిన ఫోన్ నెంబర్ కాస్త స్విచ్ఛాఫ్ రావడంతో కంపెనీ ఇచ్చిన అడ్రస్ తో విజయనగరం వై జంక్షన్ కు వచ్చి చూడగా తాళం వెక్కిరించడంతో ఆ ఒడిషా బాధితులంతా లబోదిబో మంటూ రూరల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాధితుల గోడు విన్న రూరల్ ఎస్ ఐ వాసుదేవ్ మరిన్ని వివరాలు తెలుసుకునే యత్నం చేస్తున్నారు.
previous post