విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెర్లాం మండలంలోని టెక్కలి-వలస నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. బైక్పై ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ముగ్గురు చిన్నారులు అక్కడిక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని రాజాం ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. పోలిపల్లి పైడిమాంబ జాతరకు వీరు వెళుతుండగా.. ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
previous post