నూతన కలెక్టరేట్ ఆవరణంలో నిర్మితమవుతున్న ఈవిఎం గౌడౌన్ పనులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్అండ్బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్ పనులు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పూర్తయ్యేల కార్యాచరణ చేయాలన్నారు.
లేబర్ ఎక్కువమందింని వినియోగించి, పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు. అప్రోచ్ రహదారి, పనులకు ఆటంకాలు కలగకుండా ముందస్తు పనులను పది రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు, గుతేదార్లు, అధికారులు తదితరులు ఉన్నారు.