38.2 C
Hyderabad
April 29, 2024 20: 53 PM
Slider విజయనగరం

వలంటీర్ల సేవలకు బహుమతి ప్రదానోత్సవ సభలో నాసిరకం స్నాక్స్

#kolagatla

జగన్ ప్రభుత్వంలో వలంటీర్లు ఎంతో ముఖ్యమైన పనులు చేస్తుంటారని చెప్పుకుంటుంటాం కానీ జగన్ ప్రభుత్వానికి వారంటే కూడా లెక్కే లేకుండా పోయింది. గడచిన నాలుగేళ్ల నుంచీ ప్రభుత్వం వాళ్ల సేవలను గుర్తించి సేవ మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర పేరుతో గ్రామ, వార్డ్, డివిజన్ వలంటీర్లకు నగదు బహుమతి ఇస్తూ వస్తోంది. తాజాగా ఆ పురస్కారాలప్రధానోత్సవంలో ప్రభుత్వం పంపిణీ చేసే స్నాక్స్.. ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ లో 10,284 మందికి ఒక్కోక్కోరికి 15 వేల నుంచీ 45 వేలు చొప్పున జగన్ ప్రభుత్వం నగదు ప్రోత్సహాకాన్ని అందజేసింది.

సరిగ్గా ఇక్కడే విజనరీ ఆధ్వర్యంలో హెల్త్ బెనిఫిట్స్ అంటూ ఇచ్చిన చిరు అల్పాహారంలో ఇచ్చిన మిక్చర్…ముచ్చు వాసన రావడం కలకలం రేగింది. విజయనగరం కలెక్టరేట్ లో జరిగి కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్, నగర మేయర్, డిప్యూటీ మేయర్, కలెక్టర్, జేడ్పీ సి ఈ ఓ, సచివాలయం శాఖ స్పెషల్ ఆఫీసర్ లు అలాగే వలంటీర్లందరూ ఉండగానే ఈ విజనరీ పేరుతో చిరు అల్పాహారం పంపిణీ చేశారు. అయితే ప్రతీ సారి ఫంక్షన్ కు డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్నాక్స్ పంపిణీ జరుగుతూ ఉంటోంది. కానీ ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పంపిణీ చేసిన ఈ స్నాక్స్ లో నాసిరకం స్నాక్స్ రావడంతో… అందరూ ముక్కున వేలేసుకోవడమే మిగిలింది. ఇది ఎవ్వరి నిర్లక్ష్యమో… జిల్లా యంత్రాంగమే చెప్పాలి.

Related posts

సోమశిల హైస్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

Satyam NEWS

వైసీపీతో ఎన్నికల అధికారుల కుమ్మక్కు పై భత్యాల ఆగ్రహం

Satyam NEWS

ఎలర్ట్: రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పై పూర్తి నిఘా

Satyam NEWS

Leave a Comment