ఆర్యవైశ్యుల ఆకాంక్షైన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధనకై రాష్ట్ర మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 30 శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష కార్యక్రమాన్ని మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్యవైశ్య మహాసభ (ఆర్యవైశ్య సంఘం) వనపర్తి జిల్లా అధ్యక్షుడు కల్వ రాజయ్య, ప్రధాన కార్యదర్శి దాచా లక్ష్మీనారాయణ, కోశాధికారి ఎలిశెట్టి విజయ కుమార్ తెలిపారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిలుపుమేరకు వైశ్య కార్పొరేషన్ సాధన దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య మహాసభ వనపర్తి జిల్లా మండలాల అధ్యక్షులు ,పట్టణ సంఘాల అధ్యక్షులు , వనపర్తి జిల్లా ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ,జిల్లా యువజన సంఘం ,జిల్లా మహిళా సంఘం , మహాసభ జిల్లామాజీ అధ్యక్షులు ,అనుబంధ సంఘాల అధ్యక్షులు, అవొపా సభ్యులు జిల్లా మహాసభ తరఫున రావాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్