వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పోలికేపాడు గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న హాస్పిటల్ లో చికిత్స పొందిన వారిని గ్రామ బిఆర్ఎస్ నాయకులు శివకుమార్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందించి మమత తిరుపతయ్య =22,000/-నీలమ్మ తిరుపతయ్య=6,500/-. ఎ. సునీత రాం రెడ్డి= 20,000/-. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను మంజూరు చేయించారు.
వారికి వనపర్తి లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ చెక్కులను మంత్రి కుటుంబ సభ్యులకు అందజేసి వారితో పాటు అల్పాహారం చేశారు. లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి,మండల అధ్యక్షులు గాజుల కోదండం ,గ్రామ సర్పంచ్ రజినీ రాజు ,గోపాల్ పేట మండలం సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్ ,గ్రామ నాయకులు తిరుపతయ్య, తిరుపతి పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్