తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్ నేడు సతీ సమేతంగా శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వచ్చారు. వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకస్వాములు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సోమేష్ కుమార్ శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు బాలా ఆలయ మండపంలో అర్చకస్వాములు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సోమేష్ కుమార్ దంపతులకు లడ్డూ ప్రసాదం అందించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం స్వయంభు ఆలయ పనులను చీఫ్ సెక్రటరీ పరిశీలించారు.
యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కిషన్ రావ్, ఆలయ ఈవో గీత, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులు వారి వెంట ఉన్నారు.