కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పులపుత్తూరు దళిత వాడ ప్రజలు ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు. చెయ్యేరు వరదల్లో సర్వం కోల్పోయి ఐదు నెలలు కావస్తున్నా తమని పట్టించుకున్న నాధుడు లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించి హామీ ఇచ్చి ఇండ్లు మంజూరు చేసినా, ఇంత వరకు మొదలు పెట్టలేదని ఆరోపించారు. దీనితో ఎండకు ఎండీ వానకు తడిసి ఇక్కట్లు పడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు ఇంచార్జ్ ఆర్డీవో చంద్రమౌళి కి తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.సమస్యను ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిషరిస్తామని,ఉపాధిహామీ పథకం కింద పనులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
previous post