ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఈ నెల 6 విజయనగరం జిల్లా కు రానున్నారు. విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో కొత్తగా మహిళలు, చిన్నారుల కేసులను విచారించే కొత్త కోర్టు లను ప్రారంభించనున్నారు.
ఈ మేరకు ఆ విషయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపీ తెలిపారు. ఇటీవలే పోక్సో చట్టాన్ని తీసుకు వచ్చిన సంగతి విధితమే.చిన్నపిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడానికి ఓ చట్టం తీసుకురావాలని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేసాయి.
ఎట్టకేలకు ఆ చట్టం రూపుదాల్చుకుంది.ఈ మేరకు చిన్నారులతో పాటు మహిళ లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్న తరుణంలో ఈ చట్టం రావడం సంతోషకరమైన విషయం. ఈ క్రమంలో ఫోక్సో చట్టం ప్రకారం పిల్లల కేసులను విచారించాలన్న జిల్లాలో ప్రత్యేక కోర్టు లేదు.
ఎట్టకేలకు అందుకు సంబంధించిన కోర్టు రూపుదిద్దుకోవడం..దాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 6న ఉదయం 11.30 ప్రారంభించడం జరుగుతుంది.