సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని, 8 నెలల గర్భిణీ రాధిక మృతి చెందిన విషాద ఘటన ఇది. పరీక్షకు వెళ్లే తొందరలో వేగంగా పరీక్షా గదికి చేరుకున్న రాధిక కు బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే పడిపోయింది. ఈ విషయం తెలియడంతో ఆమె భర్త అరుణ్ పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకువచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
previous post
next post