వరంగల్ రైల్వే స్టేషను దగ్గరలో శివ నగర్ లోని డాన్ బాస్కో నవజీవన్ స్ట్రీట్ చిల్డ్రన్స్ హోమ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రీ క్రిస్మస్ ఫెస్టివల్ కార్యక్రమం కు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. అనంతరం ప్రార్థన నిర్వహించారు. తదుపరి క్రిస్మస్ తాతగా పిల్లలు వేషధారులై అలరించారు.
పిల్లల డాన్స్, పాటలు అతిథులను అలరించాయి. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా ఈ పిల్లలతో గడపడం సంతోషంగా ఉందని ఏ దేవుడు చెప్పిన ప్రపంచ శాంతి, ఐక్యంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని చెబుతారు అనితా రెడ్డి అన్నారు. ప్రతి పండుగ లో ఓ విశిష్టత ఉంటుందని దానిని లో ని మంచిని గ్రహించి తీసికొవాలని, అందరూ ప్రపంచ శాంతి కోలుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పిల్లలకు, స్వెటర్లు, దుప్పట్లు, వివిధ బహుమతులను పిల్లలకు అందజేసారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, డాన్ బాస్కో డైరెక్టర్ ఫాదర్ మిల్కియర్, డిసిపియూ.సంతోష్, రాజు, దివ్య, శారదా తదితరులు పాల్గొన్నారు.