ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ పరిధిలోని డివిజన్లల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
శనివారం రాత్రి నాచారంకు చెందిన హెచ్.ఆర్. మోహన్ గృహంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సైతం పరమేశ్వర్ రెడ్డి విచ్చేశారు. డివిజన్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డితో కలిసి వేడుకలలో పాల్గొన్నారు
ఈ కార్యక్రమం లో బోరంపేట కృష్ణ ,పొన్నాల రాజు ,మహేష్ యాదవ్ ,బిక్షపతి, షర్ఫుద్దీన్, నెమలికొండ సునీల్ రెడ్డి, మూర్తి, ఉమా పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి