33.7 C
Hyderabad
April 29, 2024 01: 54 AM
Slider రంగారెడ్డి

నాచారంలో ఘనంగా క్రిస్మస్ పండుగ సంబరాలు

#Christmas

నాచారం డివిజన్లోని బాబా నగర్ లో ప్రి క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ మరియు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

అంతే కాకుండా తమ ట్రస్ట్ ద్వారా ఎవరికి ఏ ఆపద వచ్చిన ఆదుకోవడానికి ముందు ఉంటామని, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలలో సహాయ, సహకారాలు అందించడంలో ముందుంటామని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తెలిపారు. ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైనా మెడిసిన్ సీట్ సాధిస్తే, చదువుకునే ఐదు సంవత్సరాల పూర్తి కోర్సుకయ్యే ఖర్చు అంతా తమ ట్రస్టు ద్వారా భరిస్తామని మరోసారి చెప్పారు.

అలాగే పేద ప్రజలు ఎవరైనా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద అనారోగ్యాల బారిన పడితే వారి వైద్యానికి అయ్యే ఖర్చును తాను భరిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడున్న ప్రజానీకమంతా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి, అక్కడికి వచ్చిన పాస్టర్ తో, ప్రజలతో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాజన్ శేఖర్, ఉప్పల్ బి ఆర్ఎస్ నాయకులు భాస్కర్, శేఖర్ గౌడ్, బాబా నగర్ చర్చ్ పాస్టర్ రమేష్ పెద్ద ఎత్తున పాస్టర్స్,ప్రజలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

రాజకీయ మాఫియా అడ్డాగా ఆదిలాబాద్ రిమ్స్

Satyam NEWS

15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

ఓ గాడ్:ఒంగోలు శివార్లలో మహిళపై అత్యాచారం?

Satyam NEWS

Leave a Comment