చిన్న చర్లపల్లి బ్రిడ్జి పనులను మొదలుపెట్టి సాధ్యమైనంత తొందరలో పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కాప్రా సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆదేశించారు. చిన్న చర్లపల్లి నుంచి ఇందిరమ్మ గృహకల్ప దారిలో నిధులు మంజూరు అయిన పనులు చేపట్టకపోవడం ఎందుకని కాప్రా సర్కిల్ అధికారులను ప్రశ్నించారు.
తాగునీటి పైప్ లైన్ల మార్పు సంబంధించిన సమస్యతో జాప్యం కొంత ఏర్పడిందని ఇంజనీరింగ్ ఈ ఈ హరిలాల్ పేర్కొనడంతో జలమండలి డిజిఎం సతీష్ కుమార్ ను ఫోన్లో మాట్లాడి పనులు ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు ఎం పల్లి పద్మా రెడ్డి, గరిక సుధాకర్, బిఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు డప్పు గిరిబాబు, సారా అనిల్ ముదిరాజ్, జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, నేమూరి మహేష్ గౌడ్, కడియాల బాబు, జవండ్ల వేణుగోపాల్ రెడ్డి, గంప కృష్ణ, సారా వినోద్ ముదిరాజ్, రెడ్డి నాయక్, రాధాకృష్ణ, ఉపేందర్ నంది కంటి శివ, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా