విశాఖ జిల్లా పెందుర్తి సుజాత నగరంలో దారుణం జరిగింది. ఒక దళిత యువకుడికి గుండు కొట్టించిన సంఘటన సినీ నిర్మాత, జనసేన ఫాలోవర్ నూతన నాయుడు ఇంట్లో జరిగింది.
కర్రి శ్రీకాంత్ (20) ఎస్సి కులస్తుడు నూతన్ నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలుగా పనిచేస్తూ ఫస్ట్ తారీకు నుండి పని మానేశాడు. ఆ కోపాన్ని దృష్టిలో పెట్టుకొని సెల్ ఫోన్ పోయింది దానికోసం మాట్లాడదాం ఇంటికి రమ్మని చెప్పి నూతన్ నాయుడు సిబ్బంది నూతన నాయుడు భార్య చూస్తుండగా కర్ర శ్రీకాంత్ కు గుండు గీయించారు.
ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టి నుంచి పంపించేశారు. దాంతో బాధితుడు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.