రానున్న కాలంలో సెపక్తక్రా క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉండేలా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ అందేలా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశామని సెపక్తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎస్ ఆర్ ప్రేమ్ రాజ్ అన్నారు.
వనపర్తి జిల్లాలో జరిగిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారులు కాన్ఫరెన్స్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా నుండి ఎందరో యువ క్రీడాకారులు అనతికాలంలోనే జాతీయస్థాయిలో పాల్గొని ప్రతిభ కనబడడం అభినందనీయమన్నారు.
వనపర్తి లో 2015లో సెపక్తక్రా స్టేట్ మీట్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని అనంతరం జిల్లా నుండి ఎందరో క్రీడాకారులు సెపక్ తక్రా పట్ల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. తాము ఒలింపిక్ క్రీడలలో కూడా ఈ సెపక్తక్రాకు స్థానం కల్పించాలని కోరిన విషయం ఈ సందర్భంగా చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తక్రా అసోసియేషన్ కార్యదర్శి జి శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర సెపక్తక్రా జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథస్వామి, సంజీవరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు శిరీష రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని జిల్లాల ప్రతినిధులు క్రీడాకారులు పాల్గొన్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఐదు జిల్లాల సెపక్తక్రా అసోసియేషన్ నూతన కమిటీలను వనపర్తి జిల్లా కేంద్రంలోని అనూస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షుడిగా అలీం, ప్రధాన కార్యదర్శిగా బి భాస్కర్ గౌడ్, కోశాధికారిగా జి. వెంకటస్వామి ఎన్నికయ్యారు.
నాగర్ కర్నూలు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా బాబు నాయక్ ప్రధాన కార్యదర్శిగా ధర్మ నాయక్ కోశాధికారిగా మురళి ఎన్నికయ్యారు.
గద్వాల జిల్లా సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షులు గా నరసింహ రాజు ప్రధాన కార్యదర్శిగా బిలాం కోశాధికారిగా లోకా రెడ్డి ఎన్నికయ్యారు.
వనపర్తి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా బి భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గా బి శ్రీనివాస్ గౌడ్ కోశాధికారిగా వెంకట్ రామ్ రెడ్డి ఎన్నికైనట్లు సెపక్తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎస్ ఆర్ ప్రేమ్ రాజ్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి టౌన్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి