42.2 C
Hyderabad
April 30, 2024 18: 18 PM
Slider గుంటూరు

అమరావతి రైతుల మహా పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు

#drchadalawada

అమరావతి రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ నేత డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో అమరావతి మహా పాదయాత్రకి పెద్ద సంఖ్యలో  రైతులు,నాయకులు తరలివెళ్లారు. అమరావతి రైతుల పాదయాత్ర కి నరసరావుపేట నియోజకవర్గ టిడిపి కమిటీ తరఫున 2,25,500/- రూపాయలు ఆర్థిక సహాయం నియోజకవర్గ నాయకులతో కలిసి డా౹౹చదలవాడ అందచేశారు.

మహా పాదయాత్రలో పాల్గొన్న డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని మనన్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. రైతుల మహా పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని తెలిపారు. వందలాది రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.

రాజధాని నిర్వీర్యం…. అప్పుల్లోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్

రాజధాని నిర్వీర్యంతో రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందని అన్నారు. అమరావతి సంపదను ఉపయోగించుకుంటే ఎలాంటి అప్పులు తేవాల్సిన అవసరం లేదన్నారు. రూ.2 లక్షల కోట్ల సంపదను బూడిదపాలు చేశారని మండిపడ్డారు.పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని హేళనగా మాట్లాడుతుంటే బాధేస్తోందన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఉంటే వారి విమర్శలకు తావుండేది కాదని డా౹౹చదలవాడ పేర్కొన్నారు.

రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన రైతులు,టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులను రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు,సీనియర్ నాయకులు వేములపల్లి నరసయ్య కలిసి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్,నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు,రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షులు వెన్న బాలకోటి రెడ్డి,పెద్దరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ ఇండ్లమూరి రామారావు,రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు,రొంపిచర్ల మండల ప్రధాన కార్యదర్శి పులుకురి జగ్గయ్య, నరసరావుపేట పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కుమ్మెత కోటిరెడ్డి, రొంపిచర్ల మండల తెలుగు యువత అధ్యక్షులు గాడిపర్తి సురేష్,

నర్సరావుపేట మండల నాయకులు బొడ్డపాటి పేరయ్య,కొల్లి వెంకటేశ్వర్లు, ముప్పాళ్ల నాగేశ్వరరావు,మన్నన్ షరీఫ్,కడియాల తాండవ,పునాటి శ్రీనివాస్ రావు,ఇమ్మడిశెట్టి కాశయ్య, రామిశెట్టి శాఖమూరి రామ్మూర్తి,ఆలపాటి శ్రీనివాసరావు,మక్కెన ఆంజనేయులు,సైదవాలి,ఉడతా రాఘవ,అల్లూరి శ్రీనివాసరావు,దండ శివరామకృష్ణ,వసంత ఎలమంద, అబ్బూరి శ్రీనివాసరావు,మద్దుకురి బ్రహ్మయ్య,ఘట్టినేని శ్రీనివాసరావు,

సుభాని భాష,చల్లా సుబ్బారావు,యంపరాల ఖాసీం,కొర్నేపాటి సంజీవరావు,మందలపు వెంకట్ రత్నం,వెంకట్ రావు,గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మబు,హుస్సేన్,సుభాని,ఖలీల్, హరికృష్ణ,భాష,సైదా వలి,శ్రీకాంత్,పోనుగోటి శ్రీనివాస్ రావు,మోహన్ రావు రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవి,నరసరావుపేట పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ,జాగర్లమూడి విజయలక్ష్మి, కనుమూరి లక్ష్మి,పాలడుగు కుమారి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, మహిళా మణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Related posts

చిన్న యూనిట్లకు సబ్సిడీ వస్తు సామాగ్రిని అందించి మంత్రి మల్లారెడ్డి

Satyam NEWS

సమష్టి భావన కోసమే ఈ ఒలింపిక్ రన్…!

Satyam NEWS

తిరుపతి లోక్ సభ అభ్యర్ధి గెలుపు బాధ్యత పవన్ దే

Satyam NEWS

Leave a Comment