27.7 C
Hyderabad
April 26, 2024 05: 54 AM
Slider నల్గొండ

పెరిగిన వేతనాలు తక్షణమే ఇవ్వాలి: సిఐటియు డిమాండ్

#citu

పెరిగిన వేతనాలు తక్షణమే ఇవ్వాలని,లేకుంటే కార్మికులు ప్రభుత్వంపై తిరుగుబాటు పోరాటం చేయడానికి సమాయత్తం కావాలని మున్సిపల్ కార్మికుల సమావేశంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పిలుపు నిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రోషపతి పాల్గొని మాట్లాడుతూ 2021 జూన్ నెలలో 11వ,పిఆర్సి తో పెరిగిన వేతనాలు ఇవ్వాలని,లేని ఎడల ఈ నెల 14,15 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్కులో, 16,17 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేయాలని ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు నిచ్చిందని,అందులో భాగంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.గత సంవత్సరం బట్టలు,సబ్బులు,నూనె, పిఎఫ్ బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం సంఘం అధ్యక్ష్య,కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ,మెరిగ దుర్గారావు,కస్తాల సైదులు,వెంకటరమణ,కుమారి,శ్రీను, రవి,సుగుణ,సైదులు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

డివైన్ పవర్: మల్లేశ్వర స్వామి వారి పల్లకి సేవ

Satyam NEWS

మాదకద్రవ్యాల హబ్ గా నరసరావుపేట

Satyam NEWS

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment