సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతా చారి వర్ధంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శానంపూడి సైది రెడ్డి మాట్లాడుతూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రా ఏర్పాటుకు అడుగడుగున అడ్డంకులను సృష్టిస్తున్నారని తెలిసి మనోవేదనకు గురై శ్రీకాంతాచారి తన ఆత్మ బలిదానంతో నైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు అని నమ్మిన మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి అని అన్నారు.పెట్రోల్ పోసుకొని మంటలు దహించి వేస్తున్నా జై తెలంగాణ నినాదాలతో మంటలను సైతం లెక్కచేయని వీరుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మెన్ కడియం వెంకట్ రెడ్డి,జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమర్నాధ్ రెడ్డి, నెరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు కె ఎల్ ఎన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్