మంత్రి కేటీఆర్ పిలుపునందుకొని తన ఇంటి చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని, పరిసరాలను శుభ్రం చేశారు సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి. ప్రతీ ఒక్కరు తమ తమ పరిసరాలను తామే శుభ్రపరుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేసుకొని. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను దరి చేరకుండా నివారణ చేద్దామని ఆయన అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, అది కాపాడుకోవటం మన బాధ్యత అని ఎమ్మెల్యే చెప్పారు.
ప్రతి ఆదివారం పది గంటల సమయంలో నిమిషాలు మన ఇంటి పరిశుభ్రతకు కేటాయించి అందరూ ఆదర్శంగా నిలవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు శానంపూడి సైదిరెడ్డి.