పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యత గా పాటించాలని రామంతపూర్ కార్పొరేటర్ గంథం జోత్స్నానాగేశ్వరావు అన్నారు. పట్టణ ప్రగతి సమగ్ర పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా నెహ్రూనగర్ లో జి.హెచ్.ఎం.సి అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరావు టిఆర్ఎస్ కార్యకర్తలు జి.హెచ్.ఎం.సి అధికారులు ఈ.ఈ నాగేందర్ ,డి.ఈ నాగమణి,ఏ.ఈ విగ్నేశ్వరి తదితరులు పాల్గొన్నారు.