37.2 C
Hyderabad
April 26, 2024 22: 53 PM
Slider ఆదిలాబాద్

తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అందరికి అందాలి

#Nirmal CPI

తెలంగాణ రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా CPI పార్టీ జిల్లా కార్యదర్శి S.విలాస్ ప్రయాణ ప్రాంగణం ముందు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు విలాస్, S.N.రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు.

గురుదాస్ దాస్ గుప్తా  పార్లమెంట్ లో మొట్టమొదటిగా  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశాన్ని లేవనెత్తారని, అంతే కాకుండా తిరుపతిలో జరిగిన పార్టీ మహాసభలలో తీర్మానాన్ని ఆమోదించడమే కాకుండా తెలంగాణ ఉద్యమములో ముందుండి పోరాడామన్నారు.

నీళ్లు,నిధులు, ఉద్యోగాలు నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రము ప్రజల ఆకాంక్షలను, నెరవేర్చే దిశగా పాలన సాగడంలేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ  అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనన్నారు. ప్రజల పక్షాన పోరాడే CPI పార్టీని బలోపేతం చేయాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు G.S.నారాయణ,  K.భీంరెడ్డి, కుంటాల రాములు శంకర్, పుండలీక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పునరావాస కేంద్రాలకు వెళ్ళండి: మంత్రి పువ్వాడ అజయ్

Satyam NEWS

రవాణా శాఖ కు భారీగా ఆదాయo

Murali Krishna

ఎర్రగడ్డ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు

Satyam NEWS

Leave a Comment