మంగళ వారం జిల్లా కలెక్టర్ డి హరిచందన నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు.
ప్రకృతి వనం లో చెట్లను పరిశీలించి వాకింగ్ ట్రాక్ ను ఇంకా మెరుగైన రీతిలో తీర్చిదిద్దలని చిన్న పిల్లలు ఆదుకునే పార్క్ లో కూడా లన్ లను ఏర్పాటు చేయడం వలన చిన్న వారికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని సూచించారు.
నర్సరీ ని పరిశీలించి వన సంరక్షకకుడిని నియమించుకోవాలని సూచించారు. నర్సరీ ద్వారానే మొక్కలు తీసుకొని హరితాహారంకు వినియోగించుకోవలని సూచించారు.
కెనాల్ కు ఇరువైపులా రెండు వరసలలో మొక్కలను నటలని బృహత్ ప్రకృతి వనానికి కై పెద్ద కడ్మూర్ గ్రామా సమీపాన సర్వేచేసి స్థలాన్ని కేటాయించాలని తహసిల్దార్ కు ఆదేశించారు.
స్థానిక యంపిడిఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన హరితాహారం లో పాల్గొని మొక్కలు నాటి ప్రాంగణం లో పండ్ల మొక్కలను నటలని సూచించారు.
ప్రతి ఇంటికి మొక్కలు అందజేయాలని అందించిన మొక్క ను సంరక్షించే బాధ్యత ఇంటి యజమానికి సూచించాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో డిఅర్డిఓ గోపాల్ నాయక్, డిపిఓ మురళి, ప్రత్యెక అధికారి శిప్రసాద్, ఎంపిడిఓ రమేష్ కుమార్,తహసిల్దార్ మహ్జర్ ఆలి తదితరులు పాల్గొన్నారు.