తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే హక్కు సీఎం జగన్కు లేదని మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు.
స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తిరుమల పవిత్రతను, సంప్రదాయాలను కొందరు దెబ్బతీయాలని చూస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శించారు.
గత బ్రహ్మోత్సవాల్లో జగన్ సతీసమేతంగా ఉత్సవాలకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది కూడా సీఎం జగన్ ఒంటరిగా వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు.
అలాగే సీఎం జగన్ కూడా తిరుమల కొండకు వచ్చినపుడు డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో హిందూ ధర్మం దెబ్బతింటున్నా శారదాపీఠం స్వామి మౌనం వహిస్తున్నారెందుకని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు.