ఏపీ రాజధాని అంశంపై అక్టోబర్ 5 వరకు స్టేటస్కో ను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి,మాజీ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్ల తో బాటు 93 పిటిషన్లు విచారణకు వచ్చాయి.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్ధతపై ఈ కేసులు ఉన్నాయి. సీర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంఘనపై కూడా కేసులు ఉన్నాయి.
పరిపాలనా రాజధాని తరలింపు కోసం చేసిన చట్టం పై ఇప్పటికే స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు నేడు దాన్ని అక్టోబర్ 5కు పొడిగించింది. వచ్చేనెల 5నుంచి రోజువారీ విచారణ చేపడామని హైకోర్టు పేర్కొన్నది.