సీఎం జగన్.. ఉత్తరాంధ్ర లో పర్యటించనున్నారు. ఈ నెల 14 వ తేదీన విజయనగరం-విశాఖ ల మధ్య ఉన్న మోదవలసకు రానున్నారు. అదే రోజు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కొడుకు పెళ్లి కి హాజరు కానున్నారు. కాగా అదే రోజు విశాఖ లో మరో పెళ్లి కి సీఎం జగన్ హాజరవనున్నారు.
దీంతో సీఎం జగన్ పర్యటన కై..ఉభయ జిల్లా ల అధికారులు బందోబస్తు కు సంసిధ్దం కానున్నారు. కాగా తొలుత సీఎం జగన్ పర్యటన సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ బందోబస్తు కై తలమునకలైయున్నారు.5వ బెటాలియన్ లో సీఎం హెలిప్యాడ్ ఏర్పాట్లకై సిద్దమయ్యారు. ఈ మేరకు విజయనగరం డీఎస్పీ.. రూరల్ సీఐ..అలాగే డెంకాడ ఎస్ఐ లు హెలిప్యాడ్ ఏర్పాట్లలో ఉండగా…అకస్మాత్తుగా వచ్చిన సమాచారం తో విజయనగరం జిల్లా పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
మాండూస్ తుపాను తో ఇటీవల రెండు రోజులు కురిసిన వర్షం పూర్తిగా తెరుపు ఇవ్వడం… అలాగే బెటాలియన్ లో గ్రౌండ్ తడిసి పోవడంతో… సీఎం హెలిప్యాడ్ ను మార్చారు. అలాగే బందోబస్తు కూడా విశాఖ పోలీసులు తీసుకోవడంతో భీమిలి పోలీసులు పూర్తిగా బాధ్యత తీసుకోనున్నారు. దీంతో సీఎం జగన్… హాజరు కానున్న మోదవలస రఘు కాలేజీ లో జరగనున్న పెళ్లికి హాజరవనుండటంతో దాని ఎదురు గానే సీఎం హెలిప్యాడ్ సిధ్ధం చేసే పపిలో పడ్డారు.. భీమిలి పోలీసులు. కాగా సీఎం జగన్ పర్యటన పై స్పష్ఠత ఇచ్చారు… డీఆర్ఓ గణపతిరావు.14న వస్తున్నారని డీఆర్ఓ “సత్యం న్యూస్. నెట్”కు చెప్పారు.