40.2 C
Hyderabad
April 28, 2024 16: 25 PM
Slider ప్రత్యేకం

కుటుంబ సమేతంగా లండన్ వెళ్లనున్న సీఎం జగన్

#CM Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి లండన్ వెళ్తున్నారు. తన భార్య భారతితో కలిసి ఆయన లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. జగన్ కుమార్తె లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జగన్ దంపతులు తన కుమార్తె వద్దకు లండన్ కు వెళ్తుంటారు. ఈ నెల 21న జగన్ దంపతులు లండన్ కు బయల్దేరే అవకాశం ఉంది.

వారం రోజుల పాటు వీరు లండన్ లో గడపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది. గత ఏడాది జగన్ కూతురు డిగ్రీ పట్టా పొందారు. ఆ సందర్భంగా జగన్, భారతి లండన్ కు వెళ్లారు. 2019 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళ్లడం ఆనవాయతీగా మారింది.

Related posts

కడప న్యూ రిమ్స్ లో టీడీపీ నేత అన్నవితరణ

Satyam NEWS

పనికి మాలిన రాజద్రోహం చట్టం ఇంకా ఎందుకు?

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు

Satyam NEWS

Leave a Comment