సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజలు అనంతరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ దేశం మెచ్చిన నాయకుడు సిఎం కెసిఆర్ అని అన్నారు.నేడు ఊరు వాడ అనే తేడా లేకుండా సిఎం కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు ప్రజలు ఎవరికి నచ్చిన రీతిలో వారు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు.
కెసిఆర్ కారణజన్ముడు
దేశం మొత్తం కూడా ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఆలోచించే మహనీయుడు కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి,అర్చకులు సైదిరెడ్డి ని శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్