విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజికి హిజాబ్ వివాదం చేరింది. బుర్ఖా వేసుకున్న విద్యార్ధులను కాలేజీలోకి రానివ్వమని యాజమాన్యం చెప్పినట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ ఇయిర్ నుండి తాము బుర్ఖా లోనే కాలేజి వెళ్తున్నామని విద్యార్ధులు తెలిపారు. కాలేజి ఐడీ కార్డులో కూడా తాము బుర్ఖా తోనే ఫోటే దిగా మని విద్యార్ధులు తెలిపారు. వివాదం రేగడంతో ముస్లిం పెద్దలు కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.