40.2 C
Hyderabad
May 1, 2024 15: 28 PM
Slider హైదరాబాద్

అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

#kcr

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియాను సిఎం కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన  చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ,  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు  సీఎం కేసీఆర్ సూచించారు.

Related posts

పెరిగిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలకు వినూత్న రీతిలో నిరసన

Satyam NEWS

రామ‌తీర్ధం బోడికొండ‌పై కేంద్ర మాజీ మంత్రి వీరావేశం…..!

Satyam NEWS

మీ సేవాల్లో జ‌నాలు..వ‌ర‌ద స‌హాయం అబోట్ ట‌ర్న్‌

Sub Editor

Leave a Comment