ఈ నెల 7 నుంచి వరద సహాయం తిరిగి అందరికీ అందజేస్తామని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మీసేవాల వద్ద ఉదయం 4 గంటల నుంచే జనం బారులు తీరారు. మళ్ళీ ఆయా మీసేవా కేంద్రాల వద్ద పెద్దపెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఈ విషయాన్ని కాస్త జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలియజేశారు. ఆయన దీనిపై స్పందిస్తూ మీ సేవాలకు వరద బాధితులు రావొద్దని అధికారులే వరద మునక ప్రాంతాల్లో పర్యటించి వారి వారి బ్యాంకు అకౌంట్లలో వరద సహాయాన్ని వేస్తారని ఈ విషయంలో బాధితులు ఆందోళన చెందవద్దన్నారు. వరద సహాయం కాస్త తిరిగి అబోట్ టర్న్ తీసుకోవడంతో ఉదయం నుంచి క్యూలైన్లలో మీసేవాల వద్ద వేచి ఉన్నజనాలు కాస్త లబోదిబోమంటూ వెనుదిరగడం కొసమెరుపు.
previous post