నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మునుగోడు నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నట్టు బిజెపి పార్టీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ కార్యకర్తలు, గుండాయిజం రౌడీయిజం చేస్తూ బిజెపి పార్టీ నాయకులపై దాడి చేయడం సిగ్గుచేటు అని బిజెపి పార్టీ నాయకులు మండిపడ్డారు.
previous post